
బైక్ ఢీ – ఒకరి మృతి
ముదిగుబ్బ: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... కూలి పనులతో జీవనం సాగిస్తున్న నల్లచెర్లోపల్లికి చెందిన ఎం లక్ష్మన్న (59) సోమవారం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మలకవేమల సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో లక్ష్మన్నతో పాటు మరో ద్విచక్ర వాహనదారుడు శంకర్నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో లక్ష్మన్న మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.