
గ్రంథాలయాలపై పాలకుల నిర్లక్ష్యం
ఇలాంటి ఘటనలు ప్రతి గ్రామం, పట్టణంలో నిత్యం వెలుగు చూస్తున్నాయి. కాసుల కోసం కొంతమంది ల్యాబ్ నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు.
సోమందేపల్లి: ప్రజలకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. శిథిల దశకు చేరుకున్న భవనాల మరమ్మతులకు నిధుల కొరత వెంటాడుతోంది. జిల్లా వ్యాప్తంగా 36 లైబ్రరీలు ఉన్నాయి. ఇందులో 23 పాతబడిన, పక్కా భవనాలు, 8 రెంటెండ్ ఫ్రీ భవనాలు, 5 అద్దె భవనాల్లో గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. కొన్ని భవనాలు ఇరుకుగా ఉంటుండటంతో పత్రికలు, పుస్తకాలు చదవడానికి పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. కుర్చీల కొరత కారణంగా కొందరు నిల్చునే చదువుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే శిథిలమైన భవనాల గోడలు, పై కప్పులు కూలే ప్రమాదం లేకపోలేదు. కొన్ని చోట్ల గ్రంథాలయాల భవనాల ముందు స్థలాలు ఆక్రమణకు గురవుతుండటంతో పాఠకుల వాహనాల పార్కింగ్కు సమస్య ఏర్పడుతోంది.
వేధిస్తున్న సిబ్బంది కొరత
గ్రంథాలయాలకు సిబ్బంది కొరత ఏర్పడింది. చాలా చోట్ల ఒకే గ్రంథాలయ అధికారి రెండు మూడు చోట్ల ఇన్చార్జ్లుగా పనిచేస్తున్నారు. తద్వార లైబ్రరీల ద్వారా సరైన విధంగా పాఠకులకు సేవలు అందే పరిస్థితి లేదు. జిల్లాలో దాదాపు 20 చోట్ల గ్రంథాలయ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డిజిటల్ లైబ్రరీ కలేనా?
ప్రస్తుత సాంకేతిక యుగంలో డిజిటల్ లైబ్రరీలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. అయితే శ్రీసత్యసాయి జిల్లాలో ఒక్క చోట కూడా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయలేదు. ఉన్న గ్రంథాలయాల్లో తగిన పుస్తకాలు అందుబాటులో లేవు. మరుగుదొడ్లు, తాగునీటి తదితర సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించడం లేదు.
శిథిల దశకు చేరుకున్న భవనాలు
భారీ వర్షాలకు కూలే ప్రమాదం
మరమ్మతులకు వేధిస్తున్న నిధుల కొరత