సీహెచ్‌ఓలను రెగ్యులర్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీహెచ్‌ఓలను రెగ్యులర్‌ చేయాలి

May 7 2025 12:52 AM | Updated on May 7 2025 12:52 AM

సీహెచ్‌ఓలను రెగ్యులర్‌ చేయాలి

సీహెచ్‌ఓలను రెగ్యులర్‌ చేయాలి

పుట్టపర్తి అర్బన్‌: ఆయుస్మాన్‌ భారత్‌ నిబంధనల మేరకు 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న తమను రెగ్యులర్‌ చేయాలంటూ కూటమి ప్రభుత్వాన్ని సీహెచ్‌ఓలు డిమాండ్‌ చేశారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద సీహెచ్‌ఓలు, ఎంఎల్‌హెచ్‌పీలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ న్యాయపరమైన సమస్య పరిష్కారం కోరుతూ ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ను కలిస్తే... ‘మిమ్మల్ని తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రూ.500 కోట్లు మిగులుతుంది’ అని చెప్పడం అన్యాయమన్నారు. న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె కొనసాగిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement