
సీహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి
పుట్టపర్తి అర్బన్: ఆయుస్మాన్ భారత్ నిబంధనల మేరకు 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న తమను రెగ్యులర్ చేయాలంటూ కూటమి ప్రభుత్వాన్ని సీహెచ్ఓలు డిమాండ్ చేశారు. డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద సీహెచ్ఓలు, ఎంఎల్హెచ్పీలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ న్యాయపరమైన సమస్య పరిష్కారం కోరుతూ ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ను కలిస్తే... ‘మిమ్మల్ని తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రూ.500 కోట్లు మిగులుతుంది’ అని చెప్పడం అన్యాయమన్నారు. న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె కొనసాగిస్తామన్నారు.