వైఎస్సార్‌ స్మారక స్థూపం పునఃప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ స్మారక స్థూపం పునఃప్రతిష్ట

May 6 2025 1:05 AM | Updated on May 6 2025 1:05 AM

వైఎస్సార్‌ స్మారక స్థూపం పునఃప్రతిష్ట

వైఎస్సార్‌ స్మారక స్థూపం పునఃప్రతిష్ట

చిలమత్తూరు: దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సేవలకు గుర్తుగా హిందూపురం పట్టణంలోని రహమత్‌పురం సర్కిల్‌లో ఏర్పాటు చేసిన స్మారక స్థూపాన్ని సోమవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పునఃప్రతిష్టించారు. మున్సిపల్‌ అధికారులు శనివారం రాత్రి స్మారక స్థూపాన్ని తొలగించడం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. మున్సిపల్‌ అధికారులు తిరిగి స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నూతన స్థూపాన్ని పునఃప్రతిష్టించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, కొబ్బరి కాయలు కొట్టారు. ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు వేణురెడ్డి మాట్లాడుతూ స్మారక స్థూపాన్ని కూటమి నాయకుల సూచనలతో అధికారులు తొలగించారన్నారు. వైఎస్సార్‌ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరితరమూ కాదన్నారు. ఎంతటి వారైనా తమ అభిమాన నేత స్మారకంగా ఉన్న వాటి జోలికొస్తే ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కురుబ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.ఏ శివ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆసిఫ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు బలరామిరెడ్డి, జబీవుల్లా, వాణిజ్య విభాగం జిల్లా అద్యక్షుడు మహేష్‌గౌడ్‌, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్‌ మండల కన్వీనర్లు రామకృష్ణారెడ్డి, నిస్సార్‌ అహ్మద్‌, రాము, టౌన్‌ కన్వీనర్‌ మన్సూర్‌, ఎంపీటీసీ ధనుంజయరెడ్డి, శివశంకర్‌రెడ్డి, నాగరాజు, రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు దాదాపీర్‌, డా.బాషా, జయప్ప, మల్లికార్జున, చంద్ర, రామచంద్ర, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, మింటు, ఫారుఖ్‌, షబ్బీర్‌, మాజీ మండల కన్వీనర్‌ నక్కలపల్లి శ్రీరామిరెడ్డి, తిప్పేరుద్రయ్య, శ్రీరాములు, శబరీష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సానె రంగారెడ్డి, న్యాతరెడ్డి, నవీన్‌, ప్రణయ్‌రెడ్డి, నరసింహులు, చాంద్‌బాషా, అయూబ్‌ బేగ్‌, కవితారెడ్డి, సహేరాభాను, రామాంజనేయులు, సూర్యమోహన్‌, సలాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement