బీమా రంగానికి తీవ్ర నష్టం | - | Sakshi
Sakshi News home page

బీమా రంగానికి తీవ్ర నష్టం

Dec 17 2025 6:44 AM | Updated on Dec 17 2025 6:44 AM

బీమా రంగానికి తీవ్ర నష్టం

బీమా రంగానికి తీవ్ర నష్టం

నెల్లూరు(అర్బన్‌): బీమా రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక రంగానికి, ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని ఎల్‌ఐఏసీ ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఏబీ కార్యదర్శి నరసింహులు అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నెల్లూరులోని జ్యోతిరావు పూలే విగ్రహం సమీపంలో ఉన్న ఎల్‌ఐసీ సీఏబీ కార్యాలయం వద్ద ఆ బ్రాంచ్‌ ఏజెంట్లు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో బీమా రంగంపై విదేశీ పెత్తనం ఏర్పడుతోందన్నారు. ఇప్పటి వరకు ఎల్‌ఐసీ సేకరించే ప్రీమియం రైల్వే, రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు లాంటి వాటి కోసం ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో అందించేదన్నారు. తాజా నిర్ణయంతో ప్రజలు చెల్లించే ప్రీమియంకి భద్రత లేకుండా పోతుందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓఐ నాయకులు రజనీకాంత్‌, రషీద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement