
గ్రావెల్ రవాణా అడ్డగింత
● దాడిలో ఇద్దరికి గాయాలు
జలదంకి: మండలంలోని జమ్మలపాళెం చెరువులో జేసీబీ సాయంతో గ్రావెల్ను అక్రమంగా తరలిస్తుండగా, గ్రామానికి చెందిన టీడీపీ నేత సింగమనేని మనోజ్, జనసేన నేత శెట్టిపల్లి మధు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా చెరువు నుంచి ఎలా తరలిస్తారని ప్రశ్నించగా, గ్రామానికి చెందిన నక్కా మాధవ, మహేంద్ర, బాబు, జేసీబీ, ట్రాక్టర్ డ్రైవర్ దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారు కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ను సర్పంచ్ అనుమతితో తోలుతుండగా, వారొచ్చి దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారని మాజీ సర్పంచ్ నక్కా మాధవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.