
వెంగళరావునగర్లో కార్డన్ సెర్చ్
నెల్లూరు సిటీ: వేదాయపాళెంలోని వెంగళరావునగర్ ఏ బ్లాక్లో కార్డన్ సెర్చ్ను ఆదివారం తెల్లవారుజామున నిర్వహించారు. ఏఎస్పీ, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు, స్పెషల్ పార్టీలతో కలిసి సుమారు 45 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాల్లేని 45 బైక్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు అనుమానితుల నుంచి వేలిముద్రలను సేకరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని వివరించారు. అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.