
రోడ్డు ప్రమాదంలో విద్యార్థినికి గాయాలు
ఉదయగిరి: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని గాయపడిన ఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక మేకపాటి గౌతమ్రెడ్డి వ్యవసాయ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న లాస్యప్రియ తన స్నేహితురాలతో కలిసి పట్టణంలోకి వెళ్లి తిరిగి కళాశాలకు బయల్దేరారు. ఈ క్రమంలో పోలేరమ్మ చెట్టు అరుగు వద్ద వెనుక నుంచి వేగంగా బైక్పై వస్తున్న నల్లిపోగు దాస్ ఢీకొన్నారు. రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. కాగా యువకుడు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. ఎస్సై ఇంద్రసేనారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో 33.54 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారానికి 33.54 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2150, పిన్నేరుకు 10, లోలెవల్కు 70, హైలెవల్ కు 40, మొదటి బ్రాంచ్ కాలువలకు 85 క్యూసెక్కులను విడుదల చేస్తున్నా మని వివరించారు.