మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి వేలం కేంద్రంలో మంగళవారం 584 పొగాకు బేళ్లను విక్రయించినట్లు నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 1,007 బేళ్లు రాగా వాటిలో 584 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలియజేశారు. వేలంలో 73,783.2 కిలోల పొగాకును విక్రయించగా రూ.1,56,49,598ల వ్యాపారం జరిగింది. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.280 కాగా కనిష్ట ధర రూ.160 లభించింది. మొత్తం మీద సగటు ధర రూ.212.10గా నమోదైంది. వేలంలో తొమ్మిది కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
కిలో పొగాకు గరిష్ట ధర రూ.280
కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 509 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 394 పొగాకు బేళ్ల కొనుగోలు జరిగింది. వివిధ కారణాలతో 115 బేళ్లను తిరస్కరించారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి శివకుమార్ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160 పలుకగా, సరా సరి రూ.242.91 లభించిందన్నారు. వేలంలో 16 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.