
జొన్నవాడ ఆలయంలో వ్యక్తి మృతి
● ఆలయం మూత
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో ఇందుకూరుపేట గంగపట్నం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం మృతిచెందాడు. దీంతో ఆలయాన్ని ఉదయం 11.30 గంటలకు వేద పండితులు మూసివేశారు. సాయంత్రం శుద్ధి చేసి, కొలువుల అనంతరం తెరిచారు. భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు. మృతుడి వయసు 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, అనారోగ్యంతో చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
కూల్డ్రింక్ కావాలని అడిగి..
● మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
మనుబోలు: పట్టపగలు ఇద్దరు యువకులు ఓ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన మనుబోలు మండల కేంద్రంలోని పిడూరురోడ్డులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చెన్ను బాలకృష్ణారెడ్డి, రమణమ్మ దంపతులు పిడూరురోడ్డులోని ఇంటి ముందు చిన్న అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. సాయంత్రం బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు కూల్డ్రింక్ కావాలని అడగడంతో రమణమ్మ అటు తిరిగి ఇచ్చే ప్రయత్నంలో ఉంది. అంతలో బైక్పై వెనుక కూర్చొన్న యువకుడు ఆమె మెడలోని బంగారు గొలుసును బలంగా లాగాడు. బాధితురాలు తేరుకునేలోపు వారు వేగంగా వెళ్లిపోయారు. నాలుగు సవర్ల బంగారు గొలుసు విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో
45.057 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 45.057 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. సత్యసాయిగంగ కాలువకు 60, పిన్నేరు కాలువకు 150, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
కారు డ్రైవర్ మృతిపై
కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): కారుడ్రైవర్ మృతిచెందిన ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. జ్యోతినగర్కు చెందిన పి.మునాఫ్ (35), సర్తాజ్ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. అతను ఎకై ్సజ్ శాఖలో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దంపతుల నడుమ విభేదాల నేపథ్యంలో సర్తాజ్ తన కుమార్తెతో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మునాఫ్ తన తమ్ముళ్ల వద్ద ఉంటున్నాడు. ఇటీవల అతను మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం ఉదయం తాగాడు. మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేసి మళ్లీ బయటికి వెళ్లి తాగాడు. సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో ఆటోనగర్ ఫేజ్–1లోని ఓ టింకరింగ్ షాపునకు సమీపంలో ఆటోలో మునాఫ్ పడి ఉండటాన్ని సందానీ అనే వ్యక్తి చూశాడు. వెంటనే మునాఫ్ సోదరుడు ఇమ్రాన్కు తెలియజేశాడు. అతను తన బంధువు ఇలియాజ్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని తన అన్నను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సోమవారం ఫిర్యాదు అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మునాఫ్ ఫూటుగా మద్యం తాగి ఊపిరాడక? లేదా ఇతర కారణంతో మరణించాడా? అనే వివరాలు పోస్టుమార్టంలో తెలియాల్సి ఉంది.
● దగ్గు, ఆయాసం, పిల్లికూతలతో ఇబ్బంది
● జిల్లాలో 3 లక్షల మందికి పైగా రోగులు
● నేడు ప్రపంచ ఆస్తమా నివారణా
దినోత్సవం