
కూటమి పాలనలో రైతులకు కష్టాలు
మర్రిపాడు: మెట్ట ప్రాంత పొగాకు రైతులు కూటమి ప్రభుత్వంలో కష్టాలు పడుతున్నారు. మూడు రోజుల క్రితం జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు.. డీసీపల్లి వేలం కేంద్రం వచ్చి రైతుల కష్టాలను చూసుంటే బాగుండేదని ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. డీసీపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వేలం కేంద్రం నిర్వహణాధికారి రాజశేఖర్తో చర్చించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో పొగాకు రైతులు ఆశించిన మేర గిట్టుబాటు ధర లభించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గిట్టుబాటు ధర లభించక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రతి రైతుకు రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల వరకు నష్టపోయే ప్రమాదముందన్నారు. ఆయన వెంట రాష్ట్ర మున్సిపల్ విభాగ ప్రధాన కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పార్టీ మండల కన్వీనర్లు చెన్ను వెంకటేశ్వరరెడ్డి, నాగులపాటి ప్రతాప్ రెడ్డి, మాజీ కన్వీనర్లు గంగవరపు శ్రీనివాసులునాయుడు, బొర్రా సుబ్బిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి చిట్టెం శ్రీనివాసులు, చండ్రా నారాయణస్వామి, మాగంటి శ్రీనివాసులు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో
గిట్టుబాటు ధరలు
ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే
మేకపాటి విక్రమ్రెడ్డి