మైనింగ్‌ మాఫియాకే డాన్‌! | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ మాఫియాకే డాన్‌!

May 3 2025 8:23 AM | Updated on May 3 2025 8:23 AM

మైనిం

మైనింగ్‌ మాఫియాకే డాన్‌!

గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ (ఎఫ్‌ఏసీ) అధికారి.. మైనింగ్‌ మాఫియాకే డాన్‌గా వ్యవహరిస్తూ రాజకీయ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైదాపురం గనుల సిండికేట్‌ మాఫియా అండతో ఆ సీట్లో కూర్చొన్న సదరు అధికారి అవినీతి, అక్రమాలకు రాచబాట వేస్తూ సర్వం తానై మాఫియాను నడిపిస్తున్నాడు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఆయనొక పబ్లిక్‌ సర్వెంట్‌ అనే విషయం మరిచిపోయి.. మైనింగ్‌ మాఫియాను తన కనుసన్నల్లో నడిపిస్తూ సూపర్‌ బాస్‌లాగా వ్యవహరిస్తున్నారు. క్వార్ట్‌ ్జ మైనింగ్‌, కంకర క్వారీలు, ఇసుక, గ్రావెల్‌ మాఫియాలతో అంట కాగుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతల అక్రమ దందాకు అండగా ఉంటూ ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించే స్థాయికి చేరారు.

ప్రతిపక్ష నేతలను అగౌరపరుస్తూ..

సైదాపురంలో మైకా, క్వార్ట్‌ ్జ అక్రమ మైనింగ్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మూతపడిన గనులకు వెంటనే అనుమతులివ్వాలని కోరడానికి వచ్చిన వెంకటగిరి రాజుల కుటుంబీకుడు, మాజీ ఎమ్మెల్యే సర్వజ్ఞ యాచేంద్ర విషయంలో అనుచితంగా ప్రవర్తించి వారిని అగౌర పరిచారు. కనీసం కూర్చొబెట్టి మాట్లాడకపోగా, నిలబెట్టి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఆఫీసు నుంచి వెళ్లిపోవాలంటూ అహంకార పూరితంగా మాట్లాడిన తీరు అప్పట్లో విమర్శలకు దారి తీసింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విషయంలోనూ తప్పుడు కేసులతో వివాదాస్పదంగా మారారు. గతంలో ఇదే అధికారి పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్‌లో ఎలాంటి మైనింగ్‌ కార్యకలాపాలు సాగలేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఒకానొక అధికారిగా నిర్ధారించి నివేదిక ఇచ్చారు. ఇప్పుడు అదే అధికారి అక్కడ అక్రమ మైనింగ్‌ జరిగిందంటూ కూటమి కుట్రలో భాగస్వామ్యం అయ్యా రు. ఇక మార్కెట్‌లో నాణ్యమైన క్వార్ట్‌ ్జ మెటల్‌ మెట్రిక్‌ టన్ను రూ.12 వేల కంటే ఎక్కువ లేదు. అటువంటి మెటల్‌ టన్నుకు ఏకంగా టన్నుకు రూ.2 లక్షల వంతున లెక్క కట్టి కూటమి నేతల చేతిలో కీలుబొమ్మలా మారారు. తాజాగా మాజీ జెడ్పీ వైస్‌ చైరపర్సన్‌, మాజీ రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మన్‌ పొట్టేళ్ల శీరీష సైదాపురంలో అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లితే ఆమెను అగౌరపరిచేలా వ్యవహరించడం వివాదమైంది. ఆమె పట్ల దురుసు గా ప్రవర్తించడంతో కన్నీటి పర్యతమైంది. ఖనిజ సంపద దోపిడీ దారులకు వత్తాసుగా వ్యవహిస్తూఒక బీసీ మహిళను తక్కువ చేసి తూలనాడడంపై జిల్లా వ్యాప్తంగా బీసీ వర్గాలు రగిలిపోతున్నాయి.

అక్రమ మైనింగ్‌కు అండదండ

విదేశాల్లో గిరాకీ ఉన్న సైదాపురం మైకా, క్వార్ట్‌ ్జ గనుల్లో అనధికారికంగా వ్యాపారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి, మరోబడా కంపెనీ ఆర్వీఆర్‌ సంయుక్త భాగస్వామ్యంతో స్థానిక గనులపై కన్నేశారు. రాష్ట్ర కీలక నేతకు నెలకు రూ.30 కోట్ల ముడుపులు ఇచ్చేలా ఒప్పందంతో అనధికారికంగా గనులన్నీ చేజిక్కించుని దోపిడీ చేసేందుకు స్కెచ్‌ వేశారు. వీరికి సహకరించేందుకు తిరుపతిలో పనిచేస్తున్న సదరు ఈ అధికారిని నెల్లూరులో ఇన్‌చార్జిగా ఆ సీటులో కూర్చోబెట్టారు. దీంతో వారు ఆడిందే ఆటగా ఈ అధికారి వ్యవహార శైలి ఉంది. గనుల లీజు వ్యవహారాల్లో సిండికెట్‌తో కలిసిన వారికే మాత్రమే అనుమతులిస్తున్నారు. మాఫియాకు సహకరించని వారి గనులకు లీజు పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. లీజుల వ్యవహారంలో గాని, గతంలో ఇల్లీగల్‌ వ్యాపారం చేసుకున్న వారికి భారీ పెనాల్టీలు వేసిన గనులకు పెనాల్టీ తగ్గిస్తానంటూ ఇప్పటికే వసూళ్ల ప్రక్రియ చేపట్టినట్లు ఆరోపణలున్నాయి.

అక్రమంగా రోడ్డు మెటల్‌ తరలింపు

జిల్లాలో 16కు పైగా ఉన్న క్రషర్స్‌ యజమానులు అనుమ తి లేని ప్రాంతాల్లో రాయి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ విషయం మైనింగ్‌ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని క్రషర్స్‌కు కూడా అను మతి లేదు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని చెల్లించకుండా యథేచ్ఛగా మెటల్‌ను తరలిస్తున్నారు. ఈ రీతిలో అక్రమ మైనింగ్‌ జరుగుతున్నా ఆయా క్వారీ యజమానుల నుంచి భారీ మొత్తంలో ముడుపులు అందుకుంటూ అటు వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

కూటమి నేతల అండతో సూపర్‌ బాస్‌లా..

అక్రమ దందాను నడిపిస్తున్న అధికారి

కళ్ల ముందు దోపిడీ జరుగుతున్నా..

పట్టించుకోని కబోధి

తప్పుడు కేసులతో ప్రతిపక్ష నేతలకు వేధింపులు

ప్రతిపక్ష నేతలను అగౌరపరిచేలా వ్యవహారం

మైనింగ్‌ మాఫియాకే డాన్‌! 1
1/1

మైనింగ్‌ మాఫియాకే డాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement