
నదులు, భూములు, చెరువులను చెర పట్టిన తమ్ముళ్లు
కల్లూరుపల్లి చెరువులో నిలువెత్తు గోతులు పెట్టి మట్టి తవ్వకాలు
నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాళెం ఇసుక రీచ్ నుంచి టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. జేసీబీలను వినియోగించకూడదని కలెక్టర్ ఆదేశించినా ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. యంత్రాలతో రాత్రిళ్లు ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. టిప్పర్లలో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు మామూళ్లు చేరడంతో అటు వైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు ఉన్నాయి. నరసింహకొండకు సమీపంలోని కొమ్మరపూడి వద్ద టీడీపీ నేతలు విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ‘సాక్షి’లో కథనాలు వచ్చినా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, మట్టి తవ్వకాలన్నీ షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతుండంతో ఇక్కడ అంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతోంది.
నెల్లూరు రూరల్లో ఇసుక, గ్రావెల్