
చెరువులు, ప్రభుత్వ భూముల్లో గ్రా‘వెల్’
కావలి నియోజకవర్గం గ్రావెల్ మాఫియాకు అడ్డాగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్యా కృష్ణారెడ్డి) కనుసన్నల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని దగదర్తి, కావలి, అల్లూరు మండల్లాల్లోని చెరువులు, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో భారీ యంత్రాలు ఉపయోగించి గ్రావెల్ను అక్రమ రవాణా సాగిస్తున్నారు. లేఅవుట్లకు, ఇతర వాణిజ్య అవసరాలకు గ్రావెల్ తరలించేందుకు రాత్రీ పగలూ తేడా లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. దగదర్తి మండలం దామవరం వద్ద ఎయిర్పోర్ట్కు కేటాయించిన భూములు, పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లోనూ గ్రావెల్ను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. చెరువు పోరంబోకు భూములు, మేత పోరంబోకు భూములు అయితే తవ్వకాల కారణంగా స్వరూపం కోల్పోతున్నాయి. కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో నిత్యం వందల టిప్పర్ల గ్రావెల్ తరలిపోతోంది.
మెట్టలో గ్రావెల్, క్వార్ట్ ్జ మెటల్
ఉదయగిరి నియోజకవర్గంలోని గ్రామాల్లో అపారంగా ఉన్న వైట్ క్వార్ట్ ్జ సంపదను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అండదో తమ్ముళ్లు దోచేస్తున్నారు. దుత్తలూరు మండలం బండకిందపల్లి, వింజమూరు మండలం వెంకటాద్రిపురంలో అనుమతులు లేకుండానే కంకర క్రషర్లు ఏర్పాటు చేసి అక్రమంగా విక్రయిస్తున్నారు. వింజమూరు మండలం నల్లగొండ్ల ప్రాంతంలో నాణ్యమైన గ్రావెల్తోపాటు, రఫ్ స్టోన్ కూడా లభిస్తోంది.
పెన్నమ్మ గర్భశోకం
నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని దీన్దయాళ్నగర్ వద్ద మంత్రి నారాయణ అండతో టీడీపీ నేతలు అనధికారికంగా రీచ్ను నిర్వహిస్తున్నారు. నేరుగా రీచ్ వద్దకే కార్పొరేషన్ నిధులతో రహదారిని ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విధానం ముసుగేసి పగటి సమయాల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. రాత్రయితే చాలు టీడీపీ నేతలు వారి అనుచర వర్గం యంత్రాలు పెట్టి పెన్నా నదిని కుళ్లబొడుస్తున్నారు. నిత్యం 50 భారీ వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.
దగదర్తిలో గ్రావెల్ తవ్వకాలు