ఆరు నెలల్లో పూర్తి చేస్తామని స్వయంగా సీఎం హామీ | - | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో పూర్తి చేస్తామని స్వయంగా సీఎం హామీ

May 1 2025 12:10 AM | Updated on May 1 2025 12:10 AM

ఆరు నెలల్లో పూర్తి చేస్తామని స్వయంగా సీఎం హామీ

ఆరు నెలల్లో పూర్తి చేస్తామని స్వయంగా సీఎం హామీ

జిల్లా జల వరప్రదాయని అయిన సోమశిల ప్రాజెక్ట్‌పై చంద్రబాబు నిర్లక్ష్యం చూపుతూనే ఉన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్నా.. ప్రాజెక్ట్‌ పురోభివృద్ధిలో ఎలాంటి మార్పు లేదు. ఏటా బడ్జెట్‌లో అరకొరగా నిధులు కేటాయించడం, మెయింటెనెన్స్‌ పేరుతో ఆరగించడం పరిపాటిగా మారింది. ఈ సారి అధికారంలోకి వచ్చాక కూడా ప్రాజెక్ట్‌ ఆప్రాన్‌ మరమ్మతుల విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారు. గతేడాది సీఎం కాగానే సోమశిలను సందర్శించి ఆరు నెలల్లో ఆప్రాన్‌ పనులు పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చినా.. పది నెలలైనా 30 శాతం పనులు కూడా జరగలేదంటే ప్రాజెక్ట్‌పై సీఎం చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.. పది నెలలైంది.. ఎప్పుడు చేస్తారయ్యా..

అంతేనయ్యా..!

నేను చెప్పానంటే

చేయనంతే..

మళ్లీ వచ్చినప్పుడు

చెబుతా

ఆత్మకూరు: అర్ధాంతరంగా నిలిచిన సోమశిల డ్యామ్‌ ఆప్రాన్‌ పనులు

ఆత్మకూరు: అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన సింహపురికి సోమశిల జల వర ప్రదాయని. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్‌ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. 78 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు తొమిదేళ్లు సీఎంగా ఉండగా సమగ్ర సోమశిల కలగానే మిగిలిపోయింది. బ్యాక్‌ వాటర్‌ ముంపు వాసులకు పరిహారం ఇవ్వకుండా, వారికి పునరావాసం కల్పించకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో 50 టీఎంసీలు కూడా నిలబెట్టలేని పరిస్థితి. మహానేత వైఎస్సార్‌ ముఖ్యమంత్రి కాగానే ముంపు వాసుల సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. 48 టీఎంసీలకే పరిమితమైన సోమశిల నీటి సామర్థ్యాన్ని రెండు దశల్లో 78 టీఎంసీల సమగ్ర సోమశిల కలను సాకారం చేశారు.

ప్రచారమే తప్ప.. పురోగతి లేదు..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం ఐదేళ్లూ భారీ వర్షాలు కురవడం, తరచూ వరదలు రావడంతో సోమశిల దిగువన ఆప్రాన్‌ దెబ్బతినింది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆప్రాన్‌ పనులు చేపట్టేందుకు రూ.99 కోట్లు నిధులు కేటాయించారు. అయితే వరదలు, టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే సరికి ప్రభుత్వం మారింది. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతేడాది ఆగస్టులో స్వయంగా సోమశిల జలాశయం పరిశీలించి సీడబ్ల్యూసీ అధికారులు, మంత్రులతో కలిసి డ్యామ్‌ను కలియ తిరిగి ఆరు నెలల్లో పూర్తి చేస్తామంటూ ఆర్భాటంగా హామీలు గుప్పించారు. రూ.99 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సోమశిల ప్రాజెక్ట్‌ విషయంలో ప్రచారం తప్ప.. పురోగతి లేదనేది ఆగిపోయిన డ్యామ్‌ ఆప్రాన్‌ పనులు పరిశీలిస్తే అర్థమవుతోంది. జలాశయం వద్ద అత్యంత కీలకమైన ఆప్రాన్‌ పనులు అర్ధాతరంగా నిలిచిన విషయం తెలిసిందే.

30 శాతం కూడా జరగని పనులు

10 నెలలైనా 30 శాతం కూడా

పూర్తి కాని వైనం

బిల్లులు ఇవ్వడం లేదని

కాంట్రాక్టర్‌ పనుల నిలిపివేత

జిల్లా వరప్రదాయని ప్రాజెక్ట్‌

పనుల పైన నిర్లక్ష్యం

గతేడాది డిసెంబరు వరకు సాగిన ఆప్రాన్‌ పనులు తుఫాన్‌, వర్షాల కారణంతో కొన్ని రోజులు నిలిపివేశారు. అనంతరం తిరిగి ప్రారంభించలేదు. అధికారులు కాంట్రాక్టర్‌ను అడిగితే బిల్లులు చెల్లిస్తే గానీ పనులు మొదలు పెట్టలేనని మెలిక పెట్టాడు. దీంతో ఐదు నెలలుగా పనులు నిలిచిపోయాయి. సుమారు 10 నెలల సమయం పూర్తయినా ఆప్రాన్‌ పనులు కేవలం 30 శాతం కూడా జరగలేదని తెలుస్తుంది. విలువైన వేసవి కాలాన్ని వినియోగించుకొని త్వరితగతిన కీలకమైన ఆప్రాన్‌ పనులు పూర్తి చేస్తేనే డ్యామ్‌కు భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఆప్రాన్‌పై రెండో కాంక్రీట్‌ ఫ్లోరింగ్‌ వేయాల్సి ఉంది. చుట్టూ మెష్‌ కట్టి శ్లాబు పనులు చేయాల్సిన పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితేనే ఆప్రాన్‌ పరిస్థితి ఓ దశకు చేరుకుంటుంది. మరి ఆరు నెలలకే పూర్తి చేస్తామన్న సీఎం హామీకే అధికారులకు బాధ్యతలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement