
పొగాకు రైతుల సమస్యలు
ఈ ఏడాది సరైన ధరల్లేక పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మధుసూదన్ యాదవ్, వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ తోకల కొండయ్య వైఎస్ జగన్ దృష్టికి తీసుళ్లారు. పొగాకు సాగులో కందుకూరు ప్రాంతం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. వేలమంది రైతులు ఈ పంటపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. 2024 – 25 సీజన్లో పెద్దఎత్తున పంటను సాగు చేశారని చెప్పారు. అయితే వేలంలో గిట్టుబాటు ధరలు రావడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అధినేతకు వివరించారు. క్వింటా పొగాకు సరాసరి ధర రూ.25 వేలు కూడా రావడం లేదని, దీంతో పెట్టుబడి ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఊహించని ధరలు వచ్చాయని, ప్రస్తుత ప్రభుత్వం పొగాకు రైతుల గురించి పట్టించుకోవడం లేదని వివరించారు. దీనిపై స్పందించిన జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేరన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ధరల కోసం పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వివరించినట్లు నాయకులు తెలిపారు.