మే 1న సీఎం పర్యటనకు సిద్ధంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

మే 1న సీఎం పర్యటనకు సిద్ధంగా ఉండండి

Apr 21 2025 11:55 PM | Updated on Apr 21 2025 11:55 PM

మే 1న

మే 1న సీఎం పర్యటనకు సిద్ధంగా ఉండండి

నెల్లూరు సిటీ : సీఎం చంద్రబాబు మే 1న ఆత్మకూరులో పర్యటిస్తారని, అధికారులందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి ఆనం మాట్లాడుతూ సీఎం పర్యటనలో భాగంగా ఆత్మకూరు పరిధిలో పింఛన్ల పంపిణీలో పాల్గొంటారని, నారంపేట ఎంఎస్‌ఎం పార్కు ప్రారంభోత్సవం, పార్టీ కార్యకర్తల సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఆర్డీఓ పావని, డీఎస్పీ వేణుగోపాల్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ గంగాధర్‌, ఈఈ మురళీకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌ పాల్గొన్నారు.

డీఐఈఓగా

వీవీ సుబ్బారావు

నెల్లూరు (టౌన్‌): బాపట్ల జిల్లా అద్దంకి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా చేస్తున్న వీవీ సుబ్బారావుకు పదోన్నతి కల్పిస్తూ నెల్లూరు డీఐఈఓ (డిస్ట్రిక్ట్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌)గా పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్తులు జారీ చేశారు. ప్రస్తుతం ఎఫ్‌ఏసీగా పని చేస్తున్న మధుబాబును ఇనమడుగు జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా వెనక్కి పంపించారు. సుబ్బారావు విజయవాడలోని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌లో ఎఫ్‌ఏసీగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. డీకేడబ్ల్యూ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా, ఆర్‌ఐఓ (రీజనరల్‌ ఇన్‌స్పెక్షన్‌ ఆఫీసర్‌)గా పనిచేస్తున్న ఎ.శ్రీనివాసులును చిత్తూరు డీఐఈఓగా పదోన్నతి కల్పించి కడప ఆర్జేడీగా అదనపు బాధ్యతలు కల్పించారు. ప్రస్తుతం ఆర్‌ఐఓగా, డీకేడబ్ల్యూ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా ఎవరిని నియమించలేదు.

28 నుంచి ఆన్‌లైన్‌లో

దరఖాస్తుల స్వీకరణ

నెల్లూరు (టౌన్‌): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఈఓ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీబీఎస్‌ఈ, ఐబీ, ఐసీఎస్‌ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు 2025 మార్చి 31 నాటికి 5 ఏళ్లు పూర్తయి ఉండాలన్నారు. అర్హులైన విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.

జూన్‌ 20న బార్‌

అసోసియేషన్‌ ఎన్నికలు

నెల్లూరు (లీగల్‌): నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్‌ ఖరారైంది. మే 20న నామినేషన్‌ స్వీకరణ కార్యక్రమం ప్రారంభమై 26న ముగుస్తుందని, 27న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ ప్రక్రియలు ఉంటాయి. జూన్‌ 20న ఓటింగ్‌ జరుగుతుందని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుందని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శి ఉమామహేశ్వర్‌ రెడ్డి, సుందరయ్యయాదవ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అధికారులు, సిబ్బందిపై

చర్యలు తప్పవు

జేసీ కార్తీక్‌

నెల్లూరురూరల్‌: వివిధ సర్వేల్లో వ్యతిరేకత వ్యక్తమైన అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాల్‌ నుంచి సబ్‌ కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రెండో దశ రీసర్వేపై గ్రామ సభలు వెంటనే పూర్తి చేయాలన్నారు. నోషనల్‌ ఖాతాల విషయంలో ఈ నెల 25 నుంచి మండలాల వారీగా షెడ్యూల్‌ చేసి సమీక్షిస్తామన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లోని ఆర్‌ఓ ప్లాంట్లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. పూర్తయిన టాయిలెట్లకు డోర్లు, కిటికిలు బిగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సిటిజన్‌, రైస్‌ కార్డ్స్‌ ఈకేవైసీ హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ లు వేగవంతంగా చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ ఉదయభాస్కర్‌, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డ్వామా పీడీ గంగాభవాని, జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, విద్యుత్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు విజయన్‌, వెంకటరమణ, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

మే 1న సీఎం పర్యటనకు సిద్ధంగా ఉండండి 
1
1/1

మే 1న సీఎం పర్యటనకు సిద్ధంగా ఉండండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement