
విరువూరులో రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా మార్పు చేసిన భూములివే
పేదలకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని కొందరు అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ భూములుగా మార్పు చేస్తూ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. భారీగా ముడుపులు అందడంతో ఈ ఉదంతానికి తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడీపీ నేతల పక్కా ప్లాన్
వరికుంటపాడు మండలం విరువూరు రెవెన్యూ పరిధిలో వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. పైగా ఇవి పామూరుకు సమీపంలో ఉండటంతో మంచి ధర పలుకుతోంది. ఈ తరుణంలో గత ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లా దూబగుంట సమీపంలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపనను నాటి సీఎం చంద్రబాబు చేపట్టారు. దీంతో వరికుంటపాడు మండలానికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఇక్కడి భూములపై కన్నేశారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికలకు ముందు అప్పటి తహసీల్దార్ గొల్లపల్లి శ్రీనివాసులును ముడుపులతో మభ్యపెట్టారు. సర్వే నంబర్ 5 – 1లో 4.9.. సర్వే నంబర్ 5 – 2లో 4.5.. సర్వే నంబర్ 6 – 1లో 4.8.. సర్వే నంబర్ 6 – 2లో 4.75.. సర్వే నంబర్ 7 – 1లో 4.24.. సర్వే నంబర్ 7 – 2లో 2.5.. సర్వే నంబర్ 7 – 3లో 2.42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏడుగురి పేర్లతో వన్ – బీ, అడంగళ్లో 2019 ఫిబ్రవరిలో నమోదు చేశారు. ఆ పేర్లు గల వ్యక్తులు స్థానికులు కూడా కాదు. పైగా ఈ భూముల్లో సాగు చేయలేదు.
● టీడీపీ ప్రభుత్వంలో
రెవెన్యూ రికార్డుల్లో పేర్ల నమోదు
● సుమారు రూ.నాలుగు కోట్ల
విలువైన భూములను కాజేసే యత్నం
● పచ్చనేతల అవినీతిని
బయటపెట్టిన ‘సాక్షి’
● విచారణలో ఉండగానే
ఫ్రీ హోల్డ్ భూములుగా మార్పు