
40 బ్యాచ్లతో ఇసుక లోడింగ్
ఇక్కడి ఇసుక రీచ్లో ఒక్కో బ్యాచ్కు 8 నుంచి 10 మంది చొప్పున లోడర్లు ఉన్నారు. మొత్తం 40 బ్యాచ్లు ట్రాక్టర్లకు ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ఈ ఇసుక లోడ్ చేసే బ్యాచ్ల వద్ద స్థానిక టీడీపీ నాయకుల ఆదేశాలతో ఓ కుటుంబం ఒక్కో బ్యాచ్ వద్ద రూ.50 వసూలు చేస్తున్నారు. ఇందుకు ట్రాక్టర్లకు చీటీలు ఇచ్చి ఆ మేరకు బ్యాచ్లకు లోడింగ్ పనులు కల్పిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
జిల్లా వ్యాప్తంగా ఇసుక రీచ్లను ప్రభుత్వ ఆదేశాలతో మూసి వేసినా అప్పారావుపాళెంలో ఇసుక రీచ్ రెండు రోజుల పాటు నిలిపివేసినా తిరిగి కొనసాగించడంపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిత్యం పదుల కొద్ది వాహనాలకు ఇసుకను లోడ్ చేసి రెండు, మూడు మండలాలకు తరలిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ పద్మజాకుమారిని సంప్రదించగా గత వారంలో ఆర్డీఓ ఆదేశాల మేరకు రీచ్ను క్లోజ్ చేయించాం. అక్కడ వీఆర్ఓను కాపలా ఉంచాం. రీచ్లోకి వాహనాలు వెళ్లకుండా లోతుగా గాడి తీయిస్తాం. ఈ విషయాలను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని తెలిపారు.

40 బ్యాచ్లతో ఇసుక లోడింగ్

40 బ్యాచ్లతో ఇసుక లోడింగ్