
15.5 కిలోల గంజాయి స్వాధీనం
కావలి (జలదంకి): నెల్లూరు, కావలి, గూడూరు రైల్వేస్టేషన్ల పరిధిలో సోమవారం మధ్యాహ్నం చేపట్టిన తనిఖీల్లో 15.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ మంగళవారం తెలిపారు. తమిళనాడు తిరుచ్చిరాపల్లికి చెందిన తవామణి, బిహార్కు చెందిన సూరజ్కుమార్ గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి పట్టుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో గంజాయి రవాణాదారులను పట్టుకున్న నెల్లూరు రైల్వే సీఐ హరిచందన, నెల్లూరు డీఎస్ఆర్పీ మురళీధర్, కావలి జీఆర్ప్పీ సబ్ ఇన్స్పెక్టర్ రమాదేవిని అభినందించారు.