
పెన్నాను పరిశీలిస్తున్న అధికారులు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ వద్ద పవిత్ర నది జలాలు కలుషితమవుతున్న విషయమై స్థానికుడు మధు ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్జీటీ బృందం, ఏపీ పొల్యూషన్ బోర్డు అధికారులు, స్థానిక అధికారులు బుధవారం పరిశీలన చేశారు. నెల్లూరు ఆర్డీఓ అనూష మాట్లాడుతూ ఎన్జీటీ బృందం నదిలో మురుగునీరు కలుస్తున్న మూడు ప్రదేశాలను గుర్తించి వాటర్ శాంపిల్స్ సేకరించామని, వాటిని ల్యాబ్కు పంపించడం జరుగుతుందన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామనిన్నారు. ఎన్జీటీ చైన్నె రీజినల్ డైరెక్టర్ వరలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి అధికారి అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
29న చెస్ ఓపెన్ టోర్నమెంట్
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరు జిల్లా అండర్–15 చెస్ చాంపియన్షిప్ పోటీలు ఈ నెల 29వ తేదీ రాంజీనగర్లోని రోయ చెస్ అకాడమీలో ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయని, 2010 జనవరిలో జన్మించిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. క్రీడాకారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ ఈ నెల 27గా నిర్ణయించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9603345326 నంబరుకు ఫోన్ చేసి సమాచారం పొందాలన్నారు.
జాతీయ లోక్అదాలత్, విచారణ ఖైదీలపై సమీక్ష
నెల్లూరు (లీగల్): జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్, విక్టిమ్ కాంపెన్జేషన్ స్కీం అమలు, విచారణ ఖైదీల సమస్యలు తదితర సమస్యలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం బుధవారం జిల్లా కోర్టులో జరిగింది. జిల్లా అధికారుల సూచనలు, సలహాలపై కో ఆర్డినేషన్ కమిటీలో చర్చించారు. కలెక్టర్ ఆనంద్, ఏఎస్పీ సౌజన్య, కార్పొరేషన్ కమిషనర్ నందన్, తిరుపతి డీఆర్ఓ నరసింహులు, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్ సన్యాసిరావు, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ మస్తానయ్య, ఫారెస్ట్, ఎకై ్సజ్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకు మేనేజర్లు, చిట్ ఫండ్స్ కంపెనీ మేనేజర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు జడ్జిలు, ప్యానల్ లాయర్స్ తదితరులు పాల్గొన్నారు.