
ఆగిన నిధులు..నత్తనడకన పనులు
ఉదయగిరి: గ్రామాల్లో చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘గ్రామ కొలను’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ ఉపాధి హామీ నిధులతో మండలానికి ఒకటి చొప్పున చెరువును ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. మొత్తం 37 మండలాల్లో 37 చెరువులతోపాటు కొన్ని మండలాల్లో అదనంగా మరో 10 చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. దీంతో వేగంగా పనులు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పథకం పేరును ‘గ్రామ పుష్కరిణి’గా మార్చింది. కానీ జరిగిన పనులకు బిల్లులు ఇవ్వలేదు. కొత్తగా పనులు చేపట్టలేదు.
నేపథ్యం ఇదీ
2022లో అప్పుటి వైఎస్పార్సీపీ ప్రభుత్వం గ్రామ కొలనుకు శ్రీకారం చుట్టింది. అప్పటి కలెక్టర్ చక్రధర్బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లాలో 45 చెరువులను ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి కోసం రూ.64.37 కోట్లకు పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చారు. సుమారు 50 శాతం చెరువుల పనులు ప్రారంభించారు. కొన్నిచోట్ల తుదిదశకు చేరుకున్నాయి. ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అఽధికారం చేపట్టి ఏడాది అయినా చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు. దీంతో కాంట్రాక్టర్లు తీవ్ర నష్టపోయారు. మొదలు కానీ పనులను రద్దు చేశారు.
గత ప్రభుత్వంలో
‘గ్రామ కొలను’కు శ్రీకారం
వేగంగా జరిగిన పనులు
బిల్లులు నిలిపి వేసిన కూటమి ప్రభుత్వం
గ్రామ పుష్కరిణిగా పేరు మార్చి చేతులు దులుపుకొన్న వైనం
ఆగిపోయిన చెరువుల అభివృద్ధి
నిధుల సమస్య ఉంది
జిల్లాలో 45 చెరువులను ఆధునికీకరించేందుకు గుర్తించాం. వీటిలో గత ప్రభుత్వంలో కొన్ని పనులు చేశారు. వాటికి కూడా ఇంత వరకు బిల్లులు రాలేదు. ప్రస్తుతం నిధుల సమస్య ఉంది. నిధులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం.
– దేశ్ నాయక్, ఎస్ఈ, ఇరిగేషన్

ఆగిన నిధులు..నత్తనడకన పనులు