ప్రజాదరణను ఓర్వలేకే కేసులు | - | Sakshi
Sakshi News home page

ప్రజాదరణను ఓర్వలేకే కేసులు

Jun 27 2025 4:12 AM | Updated on Jun 27 2025 4:12 AM

ప్రజాదరణను ఓర్వలేకే కేసులు

ప్రజాదరణను ఓర్వలేకే కేసులు

ఆనం విజయకుమార్‌రెడ్డి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు లభిస్తున్న ప్రజాదరణను ఓర్వలేక అక్రమ కేసులను కూటమి ప్రభుత్వం బనాయిస్తోందని పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ మోసాలను ఏడాది పాలనలోనే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. వీరికి అండగా ఉంటూ.. భరోసా కలిస్తున్న తమ నేతను ఇబ్బంది పెట్టేందుకే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెంటపాళ్ల పర్యటనలో జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ కిందపడి వ్యక్తి మరణించారంటూ తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. ఆ రోజున ఎస్పీ మాటలకు.. ప్రభుత్వం పెట్టిన కేసుకు సంబంధం లేదన్నారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా రూపొందించిన వీడియోను చూపిస్తూ కేసు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎంతో మంది మరణానికి కారణమయ్యారని, ఆయనపై ఎలాంటి కేసును ఎందుకు పెట్టలేదన్నారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డిపై బనాయిస్తున్న అక్రమ కేసుల విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా జూలై మూడున జగనన్న పర్యటన నెల్లూరులో ఉంటుందని, ప్రజాభిమానాన్ని ఆపడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement