
డ్రగ్స్ వాడకంతో అనర్థాలు
నెల్లూరు(అర్బన్): మాదకద్రవ్యాలను వినియోగిస్తే అనర్థాలు సంభవిస్తాయని డీఎంహెచ్ఓ సుజాత పేర్కొన్నారు. ప్రపంచ యాంటీ డ్రగ్ డేను పురస్కరించుకొని దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, సర్వజన ఆస్పత్రి ఆవరణలో పలువురు వైద్య సిబ్బంది, డాక్టర్లతో ప్రదర్శనను నవజీవన్ ఐడీయూ ఎన్జీఓ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. టీవీలు, సినిమాలు, సోషల్ మీడియా మాయాజాలంలో పడి యువత ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి వినియోగానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ తదితరులు పాల్గొన్నారు.