
వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో జిల్లా నేతలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో జిల్లా నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తూమాటి మాధవరావు, మేరిగ మురళి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, బుర్రా మధుసూదన్రావు, మేకపాటి విక్రమ్రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు హాజరయ్యారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో పదవులు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నాయకులకు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తున్నట్లు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జనరల్ సెక్రటరీగా దువ్వూరు మధుసూదన్రెడ్డి (గూడూరు నియోజకవర్గం), కార్యదర్శులుగా పూనూరు మనోహర్రెడ్డి (ఆత్మకూరు నియోజకవర్గం), ముమ్మారెడ్డి రవీంద్రరెడ్డి (సూళ్లూరుపేట నియోజకవర్గం), పి.సదానందరెడ్డి (వెంకటగిరి నియోజకవర్గం), రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధిగా ఎండీ మగ్దుమ్ మొహిద్దీన్ (గూడూరు నియోజకవర్గం)లను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.