
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన చేనేతలతో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
● మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
మనుబోలు: గత టీడీపీ ప్రభుత్వ పనితీరు, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరులను ప్రజలు బేరీజు వేసుకుని మంచి చేసిన వారినే గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కోరారు. మనుబోలులో బొమ్మిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ నుంచి 50 చేనేత, ఎస్సీ, ఎస్టీ కుటుంబా లు వైఎస్సార్సీపీలో చేరాయి. వీరికి మంత్రి కాకాణి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడు తూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్ తీసుకోవాలంటే గంటల తరబడి వృద్ధులు క్యూల్లో నిల్చోవాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ప్రస్తుతం అదే పింఛన్ను ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికే వచ్చి అందజేస్తున్నట్లు తెలిపారు. పొదుపు మహిళల బ్యాంకు రుణానికి సంబంధించిన మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించామన్నారు. అమ్మఒడి, రైతుభరోసా, కాపునేస్తం, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, ఈబీసీ నేస్తం, మత్స్యకార భరోసా తదితర హా మీలన్నీ నెరవేర్చామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేతలకు ఏడాదికి రూ.24 వేల చొప్పున అందజేస్తున్నారని తెలిపారు.
రూ.376 కోట్లతో సీసీ రోడ్లు
సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.376 కోట్లతో సీసీ రోడ్లు వేశామని, అవసరమైన చోటల్లా సైడ్ డ్రెయిన్లు నిర్మించామని, తాగు, సాగునీరు అందించామని మంత్రి కాకాణి తెలిపారు. ఒక్క మనుబోలు మండలంలోనే రూ.19 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించి అన్నదాతల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తనను ఇంటికి పంపుతా నని అంటున్నాడని, ఎవరినైనా ఇంటికో, అసెంబ్లీకో పంపే శక్తి ప్రజలకు మాత్రమే ఉందని మంత్రి అన్నారు. సోమిరెడ్డికి ఇప్పటికి కూడా సీటు ఇస్తారని గ్యారెంటీ లేదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని కాకాణి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చేనేతలు మంత్రిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుండాల వజ్రమ్మ, సర్పంచ్ కంచి పద్మమ్మ, ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, బొమ్మిరెడ్డి మధుసూదన్రెడ్డి, రామసుబ్బారెడ్డి, పార్థురెడ్డి, చైతన్యరెడ్డి, మహేష్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, మన్నెమాల సుధీర్రెడ్డి, మారంరెడ్డి ప్రదీప్రెడ్డి, నవకోటి, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.