రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Jul 20 2023 12:12 AM | Updated on Jul 20 2023 12:12 AM

కందుకూరు రూరల్‌: కందుకూరు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు పీడీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అండర్‌–14 విభాగంలో సీహెచ్‌ శివకార్తీక్‌, వి.సాయిచరణ్‌, ఎం.ప్రణయ్‌కుమార్‌, సీహెచ్‌ చంటి, జి.నవదీప్‌, ఎన్‌.ప్రవీణ్‌, కె.జశ్వంత్‌కుమార్‌, సీహెచ్‌ చరణ్‌, చందుతేజ, సూర్య, విల్సన్‌ ఎంపికై నట్లు వెల్లడించారు. వీరు ఈనెల 21వ తేదీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు నరసింహమూర్తి తదితరులు అభినందించారు.

కుష్టు రహిత సమాజం కోసం కృషి

నెల్లూరు(బారకాసు): జిల్లాలో 2027 కల్లా కుష్టు రహిత సమాజం కోసం కృషి చేయాలని వైద్యారోగ్యశాఖ ఆర్డీ జొన్నలగడ్డ యాస్మిన్‌ అధికారులకు సూచించారు. విచారణ నిమిత్తం బుధవారం నెల్లూరుకు వచ్చిన ఆమె స్థానిక వైద్యారోగ్య శాఖ కార్యాలయంలోని జిల్లా ఎయిడ్స్‌, లెప్రసీ, క్షయ(డీఏఎల్‌టీ) నివారణ విభాగంలో అధికారులతో సమావేశమై పలు అంశాలపై మాట్లాడారు. కుష్టు వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలను విడనాడే విధంగా అవగాహన కల్పి ంచాలన్నారు. అనుమానిత కేసులను గుర్తించేందుకు చేస్తున్న సర్వేను వేగవంతం చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలను కూడా ఈ విషయంలో భాగస్వాములు చేయాలని సూచించారు. సమావేశంలో డీఏఎల్‌టీ అధికారి డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డితోపాటు పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

డయేరియాతో మరో వృద్ధుడి మృతి

బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని ఇస్కపాళెం పంచాయతీ ఎస్సీ కాలనీలో డయేరియాతో ఇప్పటికే ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం ఈదూరు నారాయణ (75) అనే వృద్ధుడు నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇప్పటి వరకు గ్రామంలో డయేరియాతో ముగ్గురు వృద్ధులు చనిపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది స్థానికంగా ఉన్న చర్చిలో చికిత్స పొందుతున్న రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement