
PC: BCCI/IPL.com
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. ఐపీఎల్-2025 ఛాంపియన్స్గా ఆర్సీబీ నిలిచింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించిన ఆర్సీబీ.. తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది.
ఈ విజయనంతరం ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఎన్నో ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీ.. ఎట్టకేలకు తన సొంతమైనందుకు విరాట్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆఖరి ఓవర్ అవుతున్నప్పటికి ఆర్సీబీ విజయం లాంఛనం కావడంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కింగ్.. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. చివరి బంతి పడగానే మోకాళ్లపై కూర్చుని చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి సీజన్ నుంచి బెంగళూరుకే ఆడుతున్న విరాట్ కోహ్లి.. మూడు ఫైనల్స్(2009, 2011, 2016) తర్వాత తన కలను సాకారం చేసుకున్నాడు. ప్రతీ ఎడిషన్లోనూ సత్తా చాటే కోహ్లి.. ఈ ఏడాది సీజన్లోకూడా దుమ్మలేపాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 54.75 సగటుతో 657 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేశాడు.
The tears say it all 🥹
An 1️⃣8️⃣-year wait comes to an end 👏
Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @imVkohli pic.twitter.com/X15Xdmxb0k— IndianPremierLeague (@IPL) June 3, 2025
ప్రతీ ఎడిషన్లోనూ సత్తా చాటే కోహ్లి.. ఈ ఏడాది సీజన్లోకూడా దుమ్మలేపాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 54.75 సగటుతో 657 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేశాడు.
