ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఫిర్యాదు

Sep 24 2025 8:17 AM | Updated on Sep 24 2025 8:17 AM

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఫిర్యాదు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఫిర్యాదు

గజ్వేల్‌: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్వహణపై మంగళవారం బీజేపీ నేతలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు కోసం వాడుకోవాల్సిన క్యాంపు కార్యాలయాన్ని ప్రైవేటు కార్యక్రమాల కోసం వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ గజ్వేల్‌ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కుడిక్యాల రాములు, ఎస్సీమో ర్చా జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement