
పుస్తకాలొచ్చాయోచ్..
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు పుస్తకాలొచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుస్తకాలు బుధవారం ఆర్టీసీ కార్గో బస్సులో రానే వచ్చాయి. వాటిని పాఠశాల సిబ్బంది ఒక దగ్గరకు చేర్చారు. గతంలో ప్రైవేట్ వాహనాలలో పుస్తకాలు వచ్చేవని, అవి తక్కువగా ఉండేవని పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు. ఇప్పుడు కార్గో బస్సులో రావడం బాగుందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సకాలంలో పుస్తకాలు రావడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట