బ్రహ్మోత్సవాలకు సీపీకి ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు సీపీకి ఆహ్వానం

May 28 2025 5:51 PM | Updated on May 28 2025 5:51 PM

బ్రహ్

బ్రహ్మోత్సవాలకు సీపీకి ఆహ్వానం

సిద్దిపేటకమాన్‌: పట్టణంలోని శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి 46వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కార్యవర్గ సభ్యులు, అర్చకులు మహేష్‌ సీపీ అనురాధను ఆమె కార్యాలయంలో కలిసి మంగళవారం తీర్థ ప్రసాదాలు, ఆహ్వాన పత్రికను అందజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అర్చకులు మహేష్‌ పాల్గొన్నారు.

చేర్యాల ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయండి

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

చేర్యాల(సిద్దిపేట): అసంపూర్తిగా ఉన్న చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణంను వెంటనే పూర్తి చేసి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం స్థానిక ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో చాలా సార్లు చేర్యాల ఆస్పత్రి గురించి మాట్లాడానని, అవసరమైన నిధులు అందచేస్తే పేదలకు మంచి వైద్యం అందుతుందని కోరానన్నారు. అలాగే దేవాదుల నాలుగు మోటర్లు ఆన్‌ చేసి తపాసుపల్లి రిజర్వాయర్‌ నింపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు.

రమాబాయి త్యాగం ఆదర్శం

హుస్నాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఆయన భార్య రమాబాయి ఎంతో త్యాగం చేశారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కేడం లింగమూర్తి పేర్కొన్నారు. మంగళవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో రమాబాయి వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రమాబాయి త్యాగాన్ని నేటితరం ఆదర్శఽంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాయన్న, దళిత సంఘాల నాయకులు రవీందర్‌, సంపత్‌ కుమార్‌, సుధాకర్‌, హరికిషన్‌, అఽశోక్‌, వెంకటస్వామి పాల్గొన్నారు.

అర్హులందరికీ

పథకాలు అందించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి

చేర్యాల(సిద్దిపేట): అర్హులైన పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం కనకయ్య అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికార కాంగ్రెస్‌ వారి కార్యకర్తలనే ఎంపిక చేస్తున్నారన్నారు. అలా కాకుండా గ్రామంలో అర్హులైన నిరుపేదలను గుర్తించి పథకాలు వర్తింపజేయాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అధికారం చేపట్టి రెండేండ్లు కావస్తున్నా మ్యానిఫెస్టోలోని వాగ్దానాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల లిస్టు సిద్ధం చేయాలని, లేని పక్షంలో అర్హులను ఏకం చేసి పోరాటాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు సత్తిరెడ్డి, వెంకట్‌మావో, అరుణ్‌, శ్రీనివాస్‌, కరీం, తిరుపతి, సంపత్‌ పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు సీపీకి ఆహ్వానం 1
1/3

బ్రహ్మోత్సవాలకు సీపీకి ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు సీపీకి ఆహ్వానం 2
2/3

బ్రహ్మోత్సవాలకు సీపీకి ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు సీపీకి ఆహ్వానం 3
3/3

బ్రహ్మోత్సవాలకు సీపీకి ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement