
కొట్టుకుపోయిన చెక్డ్యాం ర్యాంపు
తొగుట(దుబ్బాక): మండల పరిధిలోని లింగంపేట శివారు కూడవెల్లి వాగులో చెక్డ్యాం ర్యాంపు కొట్టుకుపోయింది. దీంతో చెక్డ్యాంకు ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ర్యాంపు కొంతభాగం కొట్టుకుపోయింది. గుర్తించిన గ్రామ రైతులు నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వచ్చి చెక్డ్యాంను పరిశీలించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏడాది గడిచినా సమస్యను పరిష్కరించలేదని రైతులు వాపోతున్నారు. ఈ యాసంగిలో వరి పంటను కాపాడేందుకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని అధికారులు వదిలారు. ఈ క్రమంలో వరద ఉధృతికి చెక్డ్యాం ర్యాంపు పూర్తిగా కొట్టుకుపోయింది. వర్షాకాలంలో వాగు ప్రవహించే అవకాశం ఉంది. వరద ఉధృతంగా ప్రవహించే క్రమంలో చెక్డ్యాం కొట్టుకుపోతుందని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. వందల ఎకరాల్లో నష్టం జరుగుతుందని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు చెక్డ్యాంకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.