
పోలీసులకు అండగా భద్రత స్కీమ్
సిద్దిపేటకమాన్: విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసులకు డిపార్ట్మెంట్ ఎప్పుడూ అండగా ఉంటుందని సీపీ అనురాధ అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ డీవీఆర్ రాజుకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రూ.8లక్షల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు సీపీ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీ సు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా భద్రత స్కీమ్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్గౌడ్, పోలీసు సంఘం ఉపాధ్యక్షు డు రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.