
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి
ఘనంగా మేడే వేడుకలు
ప్రపంచ కార్మికుల దినోత్సవం ‘మే’డే ను గురువారం జిల్లాలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు, పలు కార్మిక సంఘాల నాయకులు కార్యాలయాల ఎదుట జెండాలను ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ర్యాలీలు తీశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మేడే కార్యక్రమాల్లో పార్టీల, పలు సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. – చేర్యాల(సిద్దిపేట)