కేసీఆర్‌ ఆరోపణలు అర్థరహితం | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఆరోపణలు అర్థరహితం

Apr 29 2025 9:55 AM | Updated on Apr 29 2025 10:11 AM

కేసీఆర్‌ ఆరోపణలు అర్థరహితం

కేసీఆర్‌ ఆరోపణలు అర్థరహితం

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బుచ్చిరెడ్డి

సిద్దిపేటరూరల్‌: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ కేవలం సీఎం రేవంత్‌రెడ్డిపై నిందలు వేసేందుకు మాత్రమే నిర్వహించినట్లు ఉందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బుచ్చిరెడ్డి ఆరోపించారు. సోమవారం మండల పరిధిలోని ఇర్కోడ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై మాజీ సీఎం కేసీఆర్‌ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సొంత గ్రామంలోనే ఇచ్చిన హామీ నెరవేర్చలేని కేసీఆర్‌.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పెండింగ్‌ బిల్లులన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగినవేనని అన్నారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌ సదాశివారెడ్డి, కిష్టారెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ మల్లయ్య, శ్రీనివాస్‌, బాలకిషన్‌, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement