
మల్లన్న సన్నిధిలో కాత్యాయనిదేవి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని ఐఏఎస్ అధికారి, స్టేట్ ఫైనాన్షియల్ రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ కాత్యాయని దేవి కుటుంబసమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదం, శేష వస్త్రాలను అందించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు శ్రీరాములు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు
మెరుగైన సౌకర్యాలు
మల్లన్న ఆలయ ఈఓ అన్నపూర్ణ
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడమేకాక, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. సోమవారం ఆమె ఆలయ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. 50 వసతి గదుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. స్వామి వారి కల్యాణం నాటికి మేడలమ్మ, కేతలమ్మలకు స్వర్ణ కిరీటా లు అలంకరిస్తామని తెలిపారు. ఐదు అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు కార్యాచరణ కొనసాగుతోందన్నారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్ ఆలయ నిధులతో.. మిగతా అంతస్తులు దాత ల సహకారంతో నిర్మించనున్నట్లు తెలిపారు.
మంత్రిని కలిసిన
బార్ అసోసియేషన్ సభ్యులు
హుస్నాబాద్: నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను సోమవారం హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి.. కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రిని సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్రెడ్డి, ఏజీపీ ఒగ్గోజు సదానందం, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు
కేంద్రాలు ప్రారంభం
దుబ్బాకటౌన్: రాయపోల్ మండల పరిధి లోని మందూరు, రాయపోల్, రామారం, గొల్లపల్లి, టెంకంపేటతో పాటు పలు గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం కిషన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీసీలు రాజేశ్వర్రావు, కిష్టయ్య, ప్రవీణ్, రవీందర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వీఓఏలు పాల్గొన్నారు.