కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.8లక్షలు | - | Sakshi
Sakshi News home page

కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.8లక్షలు

Apr 12 2025 8:52 AM | Updated on Apr 12 2025 8:52 AM

కొండప

కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.8లక్షలు

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.8 లక్షలు వచ్చినట్లు దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయలక్ష్మి, ఈఓ రవికుమార్‌ తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి 59 రోజుల హుండీలోని కానుకలను శుక్రవారం లెక్కించినట్లు తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ నరేష్‌, సిబ్బంది మహేందర్‌ రెడ్డి, వెంకట్‌రెడ్డి, కనకయ్య, లక్ష్మణ్‌, హరి, చందు, చిన్నా, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీని కలిసిన నూతన డీటీఓ

సిద్దిపేటకమాన్‌: జిల్లా నూతన ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీ సర్‌గా బాధ్యతలు చేపట్టిన కిష్టఫర్‌.. సీపీ అనురాధను మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా సంయుక్తంగా సమన్వయంతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా సీపీ సూచించారు.

దరఖాస్తుల ఆహ్వానం

సిద్దిపేటజోన్‌: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా వివిధ క్రీడా అంశాల్లో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే నెల 1 నుంచి 31వ తేదీ వరకు 14 ఏళ్లలోపు బాల, బాలికలకు ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న సీనియర్‌ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారులు శిక్షణ ఇచ్చే క్రీడల వివరాలు తదితర అంశాలపై ఈనెల 19లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. స్టేడియంలోని జిల్లా క్రీడల శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందచేయాలని, క్రీడలు నిర్వహించే వారికి గౌరవ వేతనం, క్రీడా సామగ్రి అందించనునట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9014580816 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

దళారులకు ధాన్యం

అమ్మి మోసపోవద్దు

డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి

కొండపాక(గజ్వేల్‌): ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దని డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో సిర్సనగండ్ల, మర్పడ్గ, దుద్దెడ, వెలికట్ట గ్రామాల్లో, ఐకేపీ ఆధ్వర్యంలో బొబ్బాయిపల్లి, తిప్పారం, మాత్‌పల్లిలో శుక్రవారం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధరను పొందాలన్నారు. సన్న రకం ధాన్యం క్వింటాల్‌కు అదనంగా రూ. 500 బోనస్‌ను చెల్లించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.

కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.8లక్షలు 
1
1/2

కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.8లక్షలు

కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.8లక్షలు 
2
2/2

కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.8లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement