పండరీపూర్ అంబాదాస్ మహరాజ్
రేగోడ్(మెదక్): ప్రతీ ఒక్కరూ భక్తి మార్గంలో నడ వాలని పండరీపూర్ అంబాదాస్ మహరాజ్ అన్నా రు. మండలంలోని మర్పల్లి గ్రామంలో దాసాంజనేయ స్వామి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వారం రోజులుగా కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహ మహోత్సవాన్ని ఆదివారం పూర్తి చేశారు. తులసి కుండీలతో గ్రామంలోని పుర వీధులగుండా భజనలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అంబాదాస్ మహరాజ్ భక్తులను ఆశీర్వదించి మాట్లాడారు. మంచి నడవడికతో సాగాలని ప్రతీరోజు.. దైవచింతనలో పాల్గొనాలని భక్తులకు సూచించారు.


