
ఈ పాఠశాలలో చేరేందుకు పోటీ
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని భుజిరంపేటలో ప్రాథమిక పాఠశాల పచ్చదనంతో కళకళ లాడుతుంది. గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులను ఆకుట్టుకునేలా పచ్చని చెట్టు, చెమన్ మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇక్కడ ఉపాధ్యాయులు వేసవి సెలవులలో సైతం మొక్కలకు నీళ్లుపోసి పెంచడంతో పాఠశాల ఆవరణలో దారికి ఇరువైపులా ఉన్న మొక్కలు, ఏపుగా పెరిగిన చెట్లు నీడనిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా 133మంది విద్యార్థులు ఉన్నారు.
భుజిరంపేట ప్రాథమిక పాఠశాలలో దారికి ఇరువైపులా ఉన్న చెమన్ మొక్కలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అందంగా ముస్తాబు చేశారు. పాఠశాలలను శుభ్రపరిచి, మామిడి తోరణాలతో, రంగు రంగుల పేపర్లతో అలంకరించారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతితో పాటు 7, 8, 9, 10 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. గురువారం వరకు దరఖాస్తులు తీసుకుని, తరువాత విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో 12వందలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

ఈ పాఠశాలలో చేరేందుకు పోటీ