
నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం
విద్యుత్ వైర్లకు తాకుతున్నాయని
చెట్ల నరికివేత
శివ్వంపేట(నర్సాపూర్): హరితహారంలో భాగంగా గతంలో నాటిన మొక్కలు గొడ్డలిపెట్టుకు గురవుతున్నాయి. మండల కేంద్రంలోని తూప్రాన్– నర్సాపూర్ హైవే పక్కన విద్యుత్ లైన్ కింద మొక్కలు నాటడం వల్ల ప్రస్తుతం అవి ఏపుగా పెరగడంతో తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. కొమ్మలు వైర్లకు తగులుతుండటంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుందని సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. వెర్లను చూడకుండా మొక్కలు నాటడంతో ప్రయోజనం లేకుండా పోయిందని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు.
వర్షానికి కూలిన ఇంటి పైకప్పు
దుబ్బాకటౌన్: దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలో శనివారం కురిసిన వర్షానికి జనగామ స్వామి ఇంటి పైకప్పు, గోడలు అర్ధరాత్రి సమయంలో కూలడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు.

నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం