చావు‘రస్తాలు’ | - | Sakshi
Sakshi News home page

చావు‘రస్తాలు’

May 26 2025 7:33 AM | Updated on May 26 2025 7:33 AM

చావు‘

చావు‘రస్తాలు’

‘పేట’బైపాస్‌ ‘ప్రమాదాల చౌరస్తా’
● తరుచూ ప్రమాదాలు ● రోడ్డు దాటాలంటేనేవణుకుపుట్టిస్తున్న వాహనాలు ● ఇప్పటికే పదుల సంఖ్యలో మృతి ● పట్టించుకోని అధికారులు

వెహికిల్‌ అండర్‌ పాస్‌నిర్మాణం చేపట్టాలి

దాశివపేట పట్టణ పరిధిలో నిర్మించిన బైపాస్‌ రోడ్డుతో గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా మారింది. సదాశివపేట పట్టణానికి మండలానికి చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం రాకపోకలను సాగిస్తుంటారు. తరుచుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు తగిన చర్యలు తీసుకుని వెహికిల్‌ అండర్‌ పాస్‌ నిర్మాణాన్ని చేపట్టాలి.

– కుమార్‌ గౌడ్‌,

మండల యువజన సంఘాల నాయకుడు

అధికారులు చర్యలు తీసుకోవాలి

దాశివపేట పట్టణ పరిధిలోని బైపాస్‌ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఎన్కేపల్లి,నిజాంపూర్‌ చౌరస్తాల వద్ద రోడ్డును దాటేందుకు ప్రజలు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో తరుచుగా ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

– నాని, యువజన నాయకుడు సదాశివపేట

నిబంధనలు పట్టించుకోరా

ఉపాధి పనులపై కేంద్రం బృందం నిలదీత

రాయికోడ్‌(అందోల్‌): జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై నిబంధనల పట్టింపులేకుండా వ్యవహరించడమేమిటని కేంద్ర తనిఖీ బృందం పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులను నిలదీశారు. దీంతో సంబంధిత అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లునమిలారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్వహించిన పనులను తనిఖీ చేసేందుకు ఆదివారం రాయికోడ్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ అధికారులు సంజయ్‌కుమార్‌ తదితరులు వచ్చారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో నిర్మించిన టాయిలెట్స్‌, వంట గది, ప్రహరీలను, పలు మెటల్‌, ఫార్మేషన్‌ రోడ్లను పరిశీలించారు. ఎక్కడా నిబంధనలు పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బృందం పర్యటిస్తుంటే రాష్ట్ర, జిల్లా అధికారులు పీఆర్‌డీఈ తదితరులు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంబంధిత శాఖ రాష్ట్ర, జిల్లా రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు, ఎంపీడీఓ ఎంఎం షఫీ,ఏపీఓ రమేశ్‌ తదితరులున్నారు.

దాశివపేట పట్టణ పరిధిలోని ముంబై జాతీయరహదారి జాతీయ రహదారి 65పై ఉన్న చౌరస్తాలు నిత్యం ప్రమాదాలతో నెత్తురోడుతున్నాయి. అతివేగంగా వెళ్లే వాహనాలతో ఈ చౌరస్తాలు కాస్తా చావు రస్తాలుగా మారాయి. సదాశివపేట పట్టణ పరిధిలోని ముంబై జాతీయరహదారి 65 బైపాస్‌ రోడ్డు ప్రమాదకరంగా మారింది.

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి):

దాదాపు తొమ్మిదేళ్ల క్రితం నిర్మించిన నాలుగు వరుసలుగా విస్తరించిన ముంబై జాతీయరహదారి 65 పై వాహనాల రాకపోకలు భారీగా పెరిగిపోయాయి. మండలంలోని దాదాపు 20 గ్రామాల ప్రజలు సదాశివపేట మండలానికి వివిధ పనుల నిత్యం వందల సంఖ్యలో రాకపోకలను సాగిస్తుంటారు. సదాశివపేట రావాలంటే నిజాంపూర్‌, వెంకటాపూర్‌,వెల్టూర్‌,ముబారక్‌పూర్‌, కొల్కుర్‌,మాచిరెడ్డిపల్లి,పొట్టిపల్లి,ఎన్కేపల్లి తదితర గ్రామాల ప్రజలు పట్టణ పరిధిలోని బైపాస్‌ రోడ్డును దాటి రావాల్సి ఉంటుంది. దీంతో బైపాస్‌ నిజాంపూర్‌,ఎన్కేపల్లి చౌరస్తాలను దాటాలంటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తోంది. ఈ ప్రాంతాల్లో వెహికిల్‌ అండర్‌ పాస్‌ నిర్మాణం లేకపోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏ వైపు నుంచి ఏ వాహనం ఎప్పడొస్తుందో, ఎవరి ప్రాణాలను హరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతాల్లో తరుచుగా ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో వారి కుటుంబాలు వీధినపడ్డాయి. మండలంలోని 20 గ్రామాల ప్రజలు మండలానికి నిత్యం వివిధ పనుల నిత్యం వస్తుండటంతో వారితో పెరుగుతున్న ట్రాఫిక్‌ ను నియంత్రించడం పోలీసులకు భారంగా మారుతోంది. ద్విచక్రవాహనదారులు,బాటసారులు అతివేగంతో వచ్చే భారీ వాహనాలను తప్పించుకుంటూ రోడ్డును దాటే క్రమంలో ప్రమాదానికి గురై మృతి చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వెహికిల్‌ అండర్‌ పాస్‌ నిర్మాణాలను చేపట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

చావు‘రస్తాలు’1
1/3

చావు‘రస్తాలు’

చావు‘రస్తాలు’2
2/3

చావు‘రస్తాలు’

చావు‘రస్తాలు’3
3/3

చావు‘రస్తాలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement