
● మూసి వేసిన మనూరు జొన్నలకొనుగోలు కేంద్రం ● కొనుగోళ్లు
దోపిడీ కేంద్రం మూసివేత
నారాయణఖేడ్: జొన్నల కొనుగోళ్లలో తరుగు పేర దోపిడీకి పాల్పడుతున్న మనూరులోని పీఏసీఎస్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాన్ని అధికారులు మూసి వేశారు. ‘సాక్షి’దినపత్రికలో ‘ఆగని తరుగు దోపిడీ!’శీర్షికన ఆదివారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. రైతుల వద్ద తరుగు పేర బస్తాకు 3కిలోల చొప్పున అధికంగా తూకం వేయడమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి జొన్నలు తెచ్చి రైతుల పేర ఈ కేంద్రంలో విక్రయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలపై ఇదివరకే ఖేడ్ ఆర్డీఓ, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ తనిఖీ చేయగా అధికంగా తూకం వేసిన విషయాన్ని గుర్తించారు. కొన్ని బస్తాల్లో 3కిలోల వరకు అదనంగా తూకం వేయడంపట్ల అధికారులు ఆశ్చర్యపోయారు. రైతుల వద్ద దోపిడీకి పాల్పడటం పట్ల కేంద్రం నిర్వాహకుడు, సీఈవో జనార్ధన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సీఈవో పద్ధతి మార్చుకోకపోవడం లేదని ‘సాక్షి’లో కథనం రావడతో జిల్లా అధికారులు స్పందించారు. ఆదివారం నుంచి కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీదేవి ‘సాక్షి’కి తెలిపారు.

● మూసి వేసిన మనూరు జొన్నలకొనుగోలు కేంద్రం ● కొనుగోళ్లు

● మూసి వేసిన మనూరు జొన్నలకొనుగోలు కేంద్రం ● కొనుగోళ్లు