స్పందించకుంటే సమ్మెకు దిగుతాం | - | Sakshi
Sakshi News home page

స్పందించకుంటే సమ్మెకు దిగుతాం

May 3 2025 8:41 AM | Updated on May 3 2025 8:43 AM

సంగారెడ్డి: కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ సంగారెడ్డి డిపో జేఏసీ చైర్మన్‌ ఎక్బాల్‌ పాషా తెలిపారు. శుక్రవారం సమ్మెకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను జేఏసీ రాష్ట్ర నాయకుడు పీకే మూర్తితో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు దిగుతామని చెప్పారు. ఒకవేళ సమ్మె అనివార్యమైతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి ఎంపీ గుర్రాజ్‌, ప్రచార కార్యదర్శి విక్రమ్‌, అడ్వైజర్‌ భూపాల్‌రెడ్డి, కోకన్వీనర్‌ ఎండీ అత్తర్‌ అలీ, తులసీ, అనిల్‌ కుమార్‌ అంజయ్య ఏడీసీ ఎన్‌ ఎం దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ జేఏసీ నాయకుల హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement