
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
హత్నూర(సంగారెడ్డి): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన హత్నూర మండలం దౌల్తాబాద్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హత్నూర మండలం గుండ్ల మార్చిన గ్రామానికి చెందిన జక్కుల ఎల్లయ్య(65) గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం పోలీసులు దౌల్తాబాద్ శివారులో జక్కుల ఎల్లయ్య మృతి చెంది ఉన్నట్లు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి మృతదేహాన్ని గుర్తించి బోరున విలపించారు. అనుమానాస్పద స్థితిలో ఎల్లయ్య మతి చెందడంతో కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.