
రక్త దాతలు.. ఈ కవలలు
జహీరాబాద్ టౌన్: అన్నిదానాల్లో కెల్లా.. రక్తదానం గొప్పది. మనమిచ్చే రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుతోంది. రక్తం అందక చనిపోయే వారు ఎక్కువ మందే ఉన్నారు. ప్రాణాలను కాపాడేందుకు అవసరమయ్యే రక్త దానం చేసే దాతలు చాలా మంది ఉన్నారు. కొంత మంది అనేక సార్లు రక్తదానం చేస్తూ స్ఫూర్తిగా నిలిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వారే జహీరాబాద్ పట్టణానికి చెందిన ఈ ఇద్దరు అన్నాదమ్ముళ్లు.
జహీరాబాద్ పట్టణంలోని విద్యుత్ కాలనీకి చెందిన జయప్రకాశ్, విజయ్కమార్ ఇద్దరూ కవలు. ఇద్దరు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే. పేదరికం కారణంగా తండ్రి చాలా కష్ట పడి పిల్లలను చదవించారు. బీహెడ్ పూర్తి ఒకరు 2008, మరొకరు 2012 సంవత్సరంలో ఉద్యోగంలో చేరారు. వీరికి దేశ భక్తి, దైవ భక్తి ఎక్కువే. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. జహీరాబాద్ పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారని తెలిస్తే చాలా రక్తదానం చేయడానికి ముందుంటారు. ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేస్తారు. ఇప్పటి వరకు 20 సార్లకు పైగా రక్తదానం చేశారు. జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనీలో బసవ మండపంలో రాష్ట్రీయ బసవదళ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.
20 సార్లకు పైగా రక్తదానం
ఆదర్శంగా నిలుస్తున్న జహీరాబాద్ పట్టణానికి చెందిన అన్నాదమ్ముళ్లు