లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణ అవసరం | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణ అవసరం

Apr 27 2025 7:54 AM | Updated on Apr 27 2025 7:54 AM

లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణ అవసరం

లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణ అవసరం

గజ్వేల్‌రూరల్‌: విద్యార్థి దశలో క్రమశిక్షణతో మెలిగినపుడే లక్ష్యాన్ని చేరుకోగలమని సౌత్‌ ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫౌండర్‌, నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ టామ్‌ చెరియన్‌ అన్నారు. శనివారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ అనిత అబ్రహం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సుమితరాయ్‌, మరో అతిథి జార్జ్‌ మార్షల్‌లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. అనంతరం టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రశంసాపత్రాలు, మెడల్స్‌తో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజమౌళి, సీపీడీసీ సభ్యులు నరేశ్‌బాబు, లక్ష్మణ్‌, శైలజ, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement