చేర్యాలలో చైన్‌ స్నాచింగ్‌ కలకలం | - | Sakshi
Sakshi News home page

చేర్యాలలో చైన్‌ స్నాచింగ్‌ కలకలం

Jun 16 2024 10:44 AM | Updated on Jun 16 2024 10:44 AM

చేర్యాలలో చైన్‌ స్నాచింగ్‌ కలకలం

చేర్యాలలో చైన్‌ స్నాచింగ్‌ కలకలం

చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రంలో చైన్‌ స్నాచింగ్‌ కలకలం రేపింది. నడుచుకుంటూ వస్తున్న ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కడవేర్గు గ్రామానికి చెందిన నరకుల వీరమణి చేర్యాలలో ఉంటున్న కుమారుడి వద్దకు శనివారం ఉదయం వచ్చింది. అక్కడి నుంచి తన తల్లి వద్దకు వెళ్లింది. సాయంత్రం తిరిగి వెళుతున్న క్రమంలో స్థానిక వాసవీగార్డెన్‌ సమీపంలో వెనుక నుంచి పల్సర్‌ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. ఆ గొలుసు విలువ సుమారు రూ.60వేలు ఉంటుందని బాధితురాలు వాపోయింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఓ.దామోదర్‌ తెలిపారు. చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డ వారి సీసీ టీవీ పుటేజీ ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఫోటోల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

మహిళ మెడలో

బంగారు గొలుసును లాక్కెళ్లిన దుండగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement