రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Oct 4 2025 8:02 AM | Updated on Oct 4 2025 8:02 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మేడ్చల్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన బడికోల్‌ భాస్కర్‌ రెడ్డి కుటుంబం మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలోని జమున వెంచర్‌ లో నివాసముంటోంది. భాస్కర్‌ రెడ్డి కుమారుడు అజయ్‌ రెడ్డి(21) డిగ్రీ చదువుతూ తండ్రి నిర్వహించే వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. గురువారం దసరా పండుగ సందర్భంగా కాళకల్‌లో ఉన్న స్నేహితులను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా రేకుల బావి ప్రాంతానికి సమీపంలో వాహనం అదుపు తప్పి, గుంతలో పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement