మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు | - | Sakshi
Sakshi News home page

మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు

Oct 4 2025 8:02 AM | Updated on Oct 4 2025 8:02 AM

మమ్మీ నన్ను క్షమించు..  నాకు బతకాలని లేదు

మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు

మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు కుత్బుల్లాపూర్‌: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్‌ బాలిక సూసైడ్‌నెట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కొంపల్లి పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. కాగా ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు. అనూరాథ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్‌ స్టార్‌ ఫైనాన్స్‌ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచ్చిన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్‌ బాలిక ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీను ను కఠినంగా శిక్షించాలని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియన్‌ డిపోర్టేషన్‌

బాలిక ఆత్మహత్య

సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించి, డ్రగ్‌ పెడ్లర్స్‌తో కలిసి సంచరిస్తున్న నైజీరియన్‌ జియోఫ్రీ డోజియోబిబ్‌ను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు డిపోర్ట్‌ చేశారు. ఈ ప్రక్రియలో ఫారెనర్స్‌ రీజనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) సహకరించిందని అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. నైజీరియాకు చెందిన జియోఫ్రీ డోజియోబిబ్‌ 2019లో అక్రమంగా దేశంలోకి వచ్చాడు. నైజీరియా నుంచి నేపాల్‌ చేరిన ఇతగాడు ఎలాంటి పత్రాలు లేకుండా రోడ్డు మార్గంలో ఢిల్లీ వచ్చాడు. అక్కడ నుంచి నగరానికి చేరుకున్న జియోఫ్రీ టోలీచౌకీలో అక్రమంగా నివసిస్తున్నాడు. బెంగళూరు, హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగిస్తున్న ఇతగాడు కొందరు డ్రగ్‌ పెడ్లర్స్‌తోనూ కలిసి తిరుగుతున్నట్లు ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ నేతృత్వంలోని బృందం జియోఫ్రీని టోలీచౌకీలో అదుపులోకి తీసుకుంది. విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఎలాంటి పత్రాలు లేకపోవడంతో తనిఖీలు చేసింది. అతడి వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభించకపోవడంతో అక్రమంగా ఉంటున్న ఆరోపణలపై సీసీఎస్‌లోని డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచింది. నగర పోలీసు ఉన్నతాధికారులు, ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ అధికారుల సాయంతో అవసరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆపై ముంబై విమానాశ్రయం నుంచి నైజీరియాకు డిపోర్టేషన్‌ ప్రక్రియ ద్వారా బలవంతంగా తిప్పి పంపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement