విద్యారంగ సమస్యలపై పోరాటం | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ సమస్యలపై పోరాటం

Jul 10 2025 8:20 AM | Updated on Jul 10 2025 8:20 AM

విద్యారంగ సమస్యలపై పోరాటం

విద్యారంగ సమస్యలపై పోరాటం

షాద్‌నగర్‌రూరల్‌: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని ఆ సంఘం తెలంగాణ ప్రాంత సహ సంఘటన మంత్రి విష్ణు అన్నారు. బుధవారం ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని విశ్వభారతి జూనియర్‌ కళాశాలలో ఏబీవీపీ నగర కార్యదర్శి నవీన్‌నాయక్‌ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విష్ణు భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. దేశంకోసం, ధర్మంకోసం పని చేసే ఏకై క విద్యార్థి సంఘం ఏబీవీపీ అన్నారు. దేశంలో భారతీయత, జాతీయ భావజాలం కలిగిన అతిపెద్ద విద్యార్థి సంఘంగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సందీప్‌, వంశీ, నవీన్‌, రాకేశ్‌, అభి, సాయి, యశ్వంత్‌, పవన్‌, రామ్‌చరణ్‌, నందకోమల్‌, అమరేందర్‌రెడ్డి, రాకేశ్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ తెలంగాణ ప్రాంతసహ సంఘటన మంత్రి విష్ణు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement